Homeతెలంగాణగన్ పార్క్ వద్ద అమరవీరులకు ఘన నివాళి

గన్ పార్క్ వద్ద అమరవీరులకు ఘన నివాళి

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టి.జె.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా వేడుకలు

Papaya in Breakfast: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు