HomeతెలంగాణAllegations rocking Kolkata CM : కోల్‌క‌త సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు... రిగ్గింగ్ జ‌రుగుతోందంటూ ఆవేద‌న‌...!

Allegations rocking Kolkata CM : కోల్‌క‌త సీఎం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు… రిగ్గింగ్ జ‌రుగుతోందంటూ ఆవేద‌న‌…!

కోల్‌క‌తా, క్రైమ్ మిర్ర‌ర్ : ప‌శ్చిమ బెంగ్‌లో బుధ‌వారం రెండో పోలింగ్ క్ర‌మంలో కోల్‌క‌త సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు.. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతుంద‌ని, ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నిక‌ల దృష్ట్యా తాను పోటిచేస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ పోలింగ్ తీరును ప‌రిశీలించేందుకు వెళ్లారు. ఇక్కడే పోటీ చేస్తోన్న బీజేపీ నేత సువేందు అధికారి కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మమతను ఉద్దేశించి..‘ ఆమెకు ఈ రోజు ఎవరూ ఓటేయరు’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, ఎన్నికల సంఘంపై సీఎం మమత విమర్శలు చేశారు.

కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు టీఎంసీ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి, ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ దీదీ సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ కార్యకర్తను రాత్రి ఎలా కొట్టారో చూడండి. ఇదేం గూండాయిజం..? ఓటింగ్ ఇలా జరగకూడదని ఆమె విమర్శించారు. మరోవైపు ఎన్నికల పరిశీలకుల ప్రవర్తనపై టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని, రాజకీయ ఒత్తిడికి లోనై వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు