అమరావాతి, క్రైమ్ మిర్రర్: భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, ముంపు ప్రభావంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తిని ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. పోలవరం రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటి నిల్వకు సంబంధించి భూసేకరణ వివరాలను ఇవ్వాలని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల కాంటూరులో నీటి నిల్వ చేసేందుకు వీలుగా అడుగులు వేస్తున్న తరుణంలో దీనిపై నివేదిక ఇవ్వాలని ఈఎన్సీని సీఎం కార్యాలయ కార్యదర్శి రాజమౌళి ఆదేశించారు.