Ex-DGP’s Granddaughter Cyber Fraud: ఓ మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె అకౌంటెంట్ను బురిడీ కొట్టించి రూ.1.20 కోట్లు కాజేశారు. ఈ నెల 13న బాధితురాలి ఫోటో డీపీగా ఉన్న నంబర్ నుంచి కంపెనీ అకౌంటెంట్ వాట్సాప్కు సందేశం వచ్చింది. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే రూ.1.20 కోట్లు బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్ తమ డైరెక్టర్ నుంచి వచ్చిందని భావించిన సదరు అకౌంటెంట్ వెంటనే రూ.1.20కోట్లు బదిలీ చేశాడు.
కొనసాగుతున్న విచారణ
అనంతరం, మరోసారి డబ్బు పంపాలంటూ అదే నంబర్ నుంచి మార్చి 17న మళ్లీ మెసేజ్ వచ్చింది. అయితే, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉండడంతో చెక్ అప్రూవల్ కోసం అకౌంటెంట్ ఆమెను నేరుగా సంప్రదించారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్ల విషయం ప్రస్తావించగా.. తాను ఎలాంటి మెసేజ్ పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్ తనకు వచ్చిన మెసేజ్, లావాదేవీ వివరాలను చూపించారు. అయితే, సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్ ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు.
