క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ ఈ ఏడాది కూడా బెంగళూరు జట్టే విజయం సాధిస్తుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపై విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండదు అని ఆ జట్టులోని మిగతావారు కూడా ఫైటర్స్ గా మారారని అన్నారు. గత సీజన్లో ఎవరైతే ప్లేయర్స్ ఆడారో వారే ఈ సీజన్ కూడా చక్కగా ఆడుతారు అని.. ఈ సీజన్ లో కూడా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని చెప్పకువచ్చారు. మనం ఒకసారి కప్పు గెలిస్తే ఇక వరుసగా విజయాలు మనవే అని కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చెబుతూ ఉంటాడు అన్నారు. నేను ఎప్పుడూ కూడా అదే నిజమని నమ్ముతాను అని పేర్కొన్నారు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ అందరు కూడా డివిలియర్స్ అన్నమాటలకు ఫిదా అయిపోతూ ఈసాల కప్ నందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాదే అనుష్క పెళ్లి?.. క్లారిటీ!
ఉస్తాద్ భగత్ సింగ్… షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?
