Homeతెలంగాణనామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్..!

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పి శరత్ చంద్ర పవార్..!

నల్లగొండ నిఘా,(క్రైమ్ మిర్రర్):- మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా, కొండమల్లెపల్లి మండలం కోల్ముంతల్ పహాడ్ తండాలోని, సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, నామినేషన్ ప్రక్రియ భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకొని, నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తునట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి, ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని, నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు.

అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలని పాటించాలని, ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బిసిఐ రాము, కొండమల్లపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్, సిబ్బంది తదితరులున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు