తెలంగాణ

అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:-
అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణపురం మండలం, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూస్తుంటే తాను భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన అద్భుతంగా ఉంటుందన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్ల పై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు.
రూ. 22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, పైరవీ కారులకు, అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందినట్లయితే వాటిని క్యాన్సిల్ చేసి మరి పేదవాళ్లకు అందేలా చూస్తానని అన్నారు. నియోజకవర్గానికి 10వేల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు దాదాపు రూ. 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతు భరోసా పథకం క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి రూ. 12 వేల రూపాయలకు పెంచామని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందించే ఇండ్లు మొదటి విడత మాత్రమేనని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉంటుందని, సంస్థ నారాయణపురం మండలం, చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఇల్లులు మంజూరు చేసినట్లు, ఇంకా అర్హులున్నారని, వారికి కూడా ఇస్తామని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు పలువురు మాట్లాడుతూ… గత 10 సంవత్సరాల కాలంగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు మంజూరు కాలేదని, ప్రజా ప్రభుత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం, వాటిని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు మోగుదాల రమేష్ గౌడ్, బొబ్బిళ్ళ మురళి, మాజీ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button