
సమాజంలో ఘోరాలు జరుగుతున్నాయి. మగవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. భార్యల చేతులో భర్తలు.. ప్రియురాళ్ల చేతిలో ప్రియుడులు దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పురుషుల హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఘటనలో మహిళలే హంతకులుగా ఉంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది భార్య. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఈ దారుణానికి ఒడిగొట్టింది.
కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది సుమంగళి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసింది సుమంగళి.
హత్య చేసిన తర్వాత ప్రియుడి సహాయంతో భర్త మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసింది. తర్వాత తనకు ఏమి తెలియదు అన్నట్లుగా భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కారంపొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించి భార్యను విచారించారు పోలీసులు. తానే హత్య చేశానని విచారణలో అంగీకరించడంతో.. భార్య ప్రియుడిని అరెస్టు చేశారు పోలీసులు.