- సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్,క్రైమ్మిర్రర్: సంత్ సేవాల్ మహారాజ్ మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఆయనచేసిన బోధనలు చిరస్మరణీయమని సనత్నగర్ ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఎస్ఆర్నగర్లో బాపునగర్కమిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్బోధించిన సత్యం, ధర్మం, అహింసా మార్గంలను అనుసరించడమే ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళులు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ డివిజన్ ప్రధానకార్యదర్శి సంతోష్ మణికుమార్తో పాటు బీఆర్ ఎస్ నాకులు అశోక్యాదవ్, గోపిలాల్చౌహాన్,కట్టా బలరాం, కూతురు నరసింహా, శేఖర్ లుపాల్గొన్నారు.
