
-
మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించుకోవాలి
-
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
ప్రతి గ్రామపంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
-
ప్రభుత్వ డాక్టర్లు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి
మునుగోడు (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) : పాలకులు మారిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మారదా అనే శీర్షికతో క్రైమ్ మిర్రర్ దినపత్రికలో శుక్రవారం ప్రచురించిన కథనానికి స్పందన . శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైద్య అధికారులతో,మునుగోడు నియోజకవర్గ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో రివ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుందని బాగా చూస్తున్నారని ప్రజల్లో నమ్మకం గలిగేలా ప్రతి ప్రభుత్వ డాక్టర్ హాస్పిటల్ సిబ్బంది పనిచేయాలన్నారు..
మునుగోడు నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాదని ప్రతి ఒక్కరికి నాణ్యమైన ట్రీట్మెంట్ అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించే బాధ్యత మీది అన్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అని, భవిష్య త్తులో ప్రతి వ్యక్తి హెల్త్ రీకార్డు నమోదు చేయాలని సూచించారు..ప్రతి గ్రామపంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేలా ప్రయత్నిస్తామన్నారు.
Also Read : నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవుట్?
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించాలని, మౌలిక వసతులు కల్పించే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు.. యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్వో మనోహర్, నల్గొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, దేవరకొండ ఇంచార్జ్ కళ్యాణ్ చక్రవర్తి ,చౌటుప్పల్ డిప్యూటీఎంహెచ్ఓ యశోద, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.