క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాజాగా హాస్య నటుడు బ్రహ్మానందం కలిశారు. ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం లాంచ్ లో వీరిద్దరూ కాసేపు ముచ్చటించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భేటీలో ఒకరికొకరు క్షేమ సమాచారాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను వీరిద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కింద క్యాప్షన్ లో పొలిటికల్ స్టార్,కామెడీ స్టార్ విత్ వన్ ఫ్రేమ్అంటూ కామెంట్లు చేస్తున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. దీంతో ఒకవైపు బ్రహ్మానందం అభిమానులు మరోవైపు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో స్టోరీలుగా పెట్టుకుంటున్నారు.
సత్యసాయి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఈ నెల 22న ఉచిత కంటి వైద్యశిబిరం
