తెలంగాణ

మంత్రి పొంగులేటికి ఢిల్లీలో క్లాస్!కాంగ్రెస్ లో కల్లోలం

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలకు సర్కార్ సిద్ధమవుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా జిల్లాలోని కాంగ్రెస్ నేతలంతా ఏకమయ్యారు. ఇరు వర్గాలు బహిరంగంగానే తిట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఎమ్మెల్యేలను మంత్రులను పట్టించుకోవడం లేదనే టాక్ వస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులను పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జై కొడుతున్నారని అంటున్నారు.

ఇతర జిల్లాల్లో వేలు పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఢిల్లీలో పార్టీ పెద్దలు గట్టిగా క్లాస్ ఇచ్చారని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించారట. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు గంట సేపు భేటీ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

మంత్రి పొంగులేటి తీరు నచ్చక తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అలాగే గతంలో బాంబులు పేలతాయని.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని పొంగులేటిని హెచ్చరించారు మల్లికార్జున్ ఖర్గే. రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని పొంగులేటికి సూచించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button