క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులకు బిఆర్ఎస్ నాయకులు సప్పిడి ఝాన్సీ పురుషోత్తం రెడ్డి ఆదివారం 2 లక్షల విలువ చేసే టెంట్ హౌస్ ను అందజేశారు.ఈ సందర్భంగా దాత ఝాన్సీ పురుషోత్తం రెడ్డిని ఎస్సీ కాలనీవాసులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వల్లాల రాములు,శ్రీహరి,వెంకట్ రెడ్డి, చంద్రయ్య,శ్రీరాములు,సిద్ధులు, పాల సంఘం చైర్మన్ బిక్షపతి, ఎస్సీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Sabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!
