Tuesday, March 10, 2026
Homeఆంధ్ర ప్రదేశ్బాలకృష్ణ పై ఫైర్ అయిన జగన్... తాగిన వ్యక్తులను కూడా అసెంబ్లీకి రానిస్తారా?

బాలకృష్ణ పై ఫైర్ అయిన జగన్… తాగిన వ్యక్తులను కూడా అసెంబ్లీకి రానిస్తారా?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ అసెంబ్లీలో పని పాట లేని చర్చను బాలకృష్ణ తీసుకువచ్చారని ఫైరయ్యారు. ఆల్కహాల్ సేవించి అసెంబ్లీకి వచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అసలు అసెంబ్లీకి తాగిన వ్యక్తిని ఎలా రాణిస్తారు?.. అని స్పీకర్ కు అసలు బుద్ధి లేదని మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలని తాజాగా మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also : మహిళల ప్రపంచ కప్ లో రికార్డులు సృష్టించిన మహిళలు.. ఓపినర్స్ ఇద్దరూ సెంచరీలే!

కాగా కొద్ది రోజుల కిందట జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి మరియు ఇతర హీరోలను తాడేపల్లికి పిలిచి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో అన్నారు. జగన్ రాకుండా మంత్రులను పంపారని.. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చారని కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. అయితే కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ తప్పుపడుతూ ఎవరూ కూడా గట్టిగా అడగలేదని.. జగన్ ఒక సైకో గాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఈ విషయంపైనే తాజాగా ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ బాలకృష్ణపై ఫైరయ్యారు.

Read also : మరోసారి తండ్రి కాబోతున్న రాంచరణ్.. వైరల్ అవుతున్న సీమంతం వేడుకలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments