క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్ ప్రతినిధి:-
జిల్లాలోని పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తులు 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో మండల దీక్షలను (హనుమాన్ మాలధారణ) అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఇదే క్రమంలో మహాదేవపూర్ మండలంలోని సూరారం శివకేశాల హనుమాన్ దేవాలయంలో అర్చకులు వంగల సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో హనుమాన్ మండల దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా అర్చకులు వంగల సత్యనారాయణ చారి మాట్లాడుతూ దీక్షా కాలంలో ఇంద్రియ నిగ్రహం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక బలం కలుగుతుందని, హనుమంతుని అనుగ్రహంతో కష్టాలు తీరుతాయని అన్నారు. జై హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా పరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ స్పెషల్ ట్వీట్?
ఢిల్లీలో హై అలెర్ట్.. ఉగ్రవాద ముప్పు!
