క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కానీ అడగకపోయినా ఎన్నో సందర్భాలలో నటుడు సోనూ సూద్ఎంతోమందికి సహాయం చేశారు. అయితే తాజాగా AI ద్వారా ఎన్నో కంపెనీలలో చాలామంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే నటుడు సోనూసూద్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారీ లే ఆఫ్స్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ ఏఐ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఇటువంటి సంక్షోభం ఉన్నప్పుడే రేపటి పారిశ్రామికవేత్తలు పుట్టుకు వస్తారు అని ఆయన ఆశాభావం అనేది వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగం కోసం ప్రతి ఒక్కరూ పాకులాడకుండా భవిష్యత్తులో కంపెనీలను స్థాపించే దిశగా ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి అని పిలుపునిచ్చారు. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ వాటిని అధిగమించి విజేతలుగా ఎదగాలని.. మంచి సక్సెస్ అందించేంతవరకు ఓటమి గురించి ఆలోచించొద్దు అని తెలిపారు.
15 ఏళ్ల భారత కుర్రాడి ఆటకు బట్లర్ ఫిదా!
తిరుపతిలో దారుణం… ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజమాని…!
