మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడంతో శుక్రవారం మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మీ కమిటీ ఏర్పాటు చేశారు.సర్పంచ్ పాలకూరి రమాదేవి చైర్మన్ గా ,11 మంది సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో సరుకులు నాణ్యమైనవి అందజేయాలని, బాలింతలకు సరి అయిన భోజనాన్ని అందించాలని సూచించారు. అంగన్వాడి టీచర్లు,బాలింతలు,విద్యార్ధుల తల్లితండ్రులు ఉన్నారు.
మున్సిపాలిటి ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ విజయం
