
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు.
మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.శంషాబాద్ విమానాశ్రయంలో తనను అరెస్టు చేస్తున్న సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి నోటీసు ఇవ్వకుండా ఎయిర్పోర్టులోనే అరెస్టు చేయడం అక్రమం అన్నారు కౌశిక్ రెడ్డి
ప్రభుత్వం కుట్రలు – అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదని కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానమన్నారు. రేవంత్ రెడ్డి గారు.. మీ కుట్రలు, అక్రమ కేసులతో నన్ను ఆపాలని అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంన్నీ చాటుతోందని విమర్శించారు. ముమ్మాటికి మీరు ప్రస్తావిస్తున్న క్వారీ రేవంత్ రెడ్డి కుటుంబంతోపాటు సీతక్క బినామీలది…. దానివల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నదని ఆరోపించారు. నా ప్రాంత ప్రజల కోసం ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు .