Friday, February 20, 2026
Homeతెలంగాణక‌న్నుల పండువ‌గా బ్రహ్మోత్సవాలు

క‌న్నుల పండువ‌గా బ్రహ్మోత్సవాలు

  • మత్స్యావతారంలో నారసింహుడు
  • గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగిన యాదాద్రి
యాదగిరిగుట్ట, క్రైమ్ మిర్రర్ : యాదగిరిగుట్టపై  పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను ఆక‌ట్టుకుంది.
కాగా స్వామి వారి ప్రధానాలయం లక్క్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు.అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి ఆస్థానం చేశారు.
నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠనాలను కనుల పండువగా చేపట్టారు.దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు అవతార రూపాల్లో స్వామివారిని ఉత్సవాల్లో అలంకరించి సేవించడం ప్రత్యేకత అంటూ ప్రధానార్చకులు మత్స్యావతార విశిష్టతను వివరించారు.
పట్టు వస్త్రాలు, బంగారు, వజ్రా భరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య మంగళకరంగా అలంకరించిన స్వామి వారిని కొలుస్తూ మంత్రోచ్ఛరణలు, మూలమంత్ర జప స్తోత్రాలతో గోవిందనామ స్మరణ మార్మోగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బీ. నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments