
క్రైమ్ మిర్రర్, కోదాడ :- కోదాడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన భాష బోయిన భాస్కరరావు ను హైదరాబాదులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ చేతుల మీదుగా నియామక పత్రము అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో భాష బోయిన భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను ఒక తాటిపై తీసుకొని వచ్చి నిద్ర సంఘమును బలోపేతం చేస్తానని ముదిరాజులను బిసి-డి నుంచి ఏ లోకి మార్చుటకు గాను ముదిరాజులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు మత్స్య సహకార సంఘాలను బలోపితం చేయుటకు కృషి చేస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మనముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజు మరియు ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు చార్మినార్ ఏసీపీ మాజీ బుడిగి అంజయ్య వాయిల సింగారం మత్స్య సహకార సంఘం మాజీ చైర్మన్ గుండ్లపల్లి వెంకన్న బోళ్ల కరుణాకర్ తమ్మనబోయిన గోపి రాజు తదితరులు పాల్గొన్నారు.
Read also : గిన్నిస్ రికార్డు సాధించిన నాట్యగురు తిరుపతి స్వామి బృందం
Read also : ఘనంగా మావోయిస్ట్ అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు





