క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేది ఎంతటి రాజకీయ విధ్వంసాన్ని సృష్టించింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విస్తృత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదంటే మీదే తప్పు అంటూ ప్రతిరోజు ఈ సున్నితమైన విషయాన్ని సాగదీస్తూ పోతున్నారు. ఈ తరుణంలోనే నేడు తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కీలక చర్చలు జరపనుంది. ఈరోజు 10:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీకి చెందినటువంటి ఒక పదిమంది సభ్యులు ఈ అంశంపై నిజ నిజాలు మాట్లాడనున్నారు. ఇక కొన్ని అనారోగ్య కారణాల ద్వారా నిన్న సభకు హాజరు కానటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సభలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి నాయకులు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12:30 గంటల నుంచి చివరిలో ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేస్తారు అని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయం ఈ రోజైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.
మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన మునిమనవడు
Exam Stress Horror: ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలన్న తండ్రి, కాల్చి చంపిన కొడుకు!

