మండల అధికారుల గైర్హజరు.. మునుగోడు ప్రజల ఆగ్రహం

•గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యం
•సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
•ప్రజల వినతులు.. సానుకూల స్పందన

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యం అని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరు కావడంతో సభలో ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పలు సమస్యలను సర్పంచ్ ,సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీఇచ్చారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అబివృద్ధి చేస్తానని,ఒకొక్క సమస్య విడతలవారీగా పరిష్కరిస్తామని,గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Lok SabhaVideo: ఫిబ్రవరి 4న లోక్ సభలో ఏం జరిగింది? షాకింగ్ వీడియో రిలీజ్!

విద్యార్థినిని ప్రేమలోకి దింపిన టీచర్.. ఆపై షాకింగ్ ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button