క్రైమ్

డ్రైనేజీలో దొరికిన శిశువు... మంట కలిసిపోయిన మానవత్వం

మార్కాపురంలో మానవత్వం మంట కలిసిపోయిన ఘటన జరిగింది. విషయం ఏంటంటే కంభం పట్టణం శివార్లో అప్పుడే పుట్టిన శిశువు డ్రైనేజీ లో కనపడడం సంచలనం రేపింది. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు ఈ డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా అలా శుభ్రం చేస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీలో అప్పుడే పుట్టిన శిశువు అందులో ఉండడం గమనించారు. అయితే వెంటనే ఆ మున్సిపల్ కార్మికులు పోలీసులకు సమాచారం అనేది అందించారు. ఆ వెంటనే పోలీసులు ఒకటి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ బాలిక దాదాపుగా పుట్టి ఒకటి లేదా రెండు రోజులే అవ్వడం దాంతోపాటుగా ఈ శిశువుని ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారనె ఆలోచనలో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఆడ శిశువును అనేది ప్రతి ఒక్కరు కూడా దూరం పెడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఉంది అమ్మాయి అని తెలియగానే చాలామంది అబార్షన్ కూడా చేయించుకుంటున్నారు. ఇలాంటి సన్నివేశాలు దాదాపు మనం చాలానే చూస్తూ ఉంటాం. అయితే ఇలా డ్రైనేజీలో శిశువుని వదిలేయడం చాలా పాపం అని అంతేకాకుండా అలా అప్పుడే పుట్టిన పాపని అలా ఎలా తన వాళ్ళు వదిలేస్తారని సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు. ఇటువంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button