నిర్మల్, క్రైమ్ మిర్రర్: అదుపు తప్పి కారు బావిలో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాతరి కావడం అదుపు తప్పి కారు బావిలో పడింది.
ఈఘటనలో శ్రీనివాస్(38) అనే యువకుడు మృతి చెందాడు. అత్యవసర పని మిద రంగపేట్ వె ళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్ముతండా సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావిలో కారు దూసుకెళ్లింది. మృతుడు కడం మండలంలోని ‘మన్ గ్రోమోర్’ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
