Friday, February 27, 2026
Homeక్రీడలుబుమ్రాను దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్ అర్షదీప్?

బుమ్రాను దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్ అర్షదీప్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు అద్భుత విజయాలను సాధిస్తూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా t20 వరల్డ్ కప్ చరిత్రలోనే టీమ్ ఇండియా జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మొన్నటి వరకు ఈ టి20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా (33 వికెట్ల)ను దాటి నేడు హర్షదీప్ సింగ్ అగ్రస్థానానికి చేరుకున్నారు. నిన్న రాత్రి జింబాబ్వే తో జరిగినటువంటి కీలకమైన మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి బుమ్రా ను అధిగమించారు. కేవలం 19 మ్యాచ్ లలోనే అర్షదీప్ సింగ్ ఈ ఘనతను సాధించడం అనేది ఒక చరిత్రని చెప్పవచ్చు. మరోవైపు ఈ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో 150కు పైగా వికెట్ల మైలురాయిని కూడా దాటారు. దీంతో టీమ్ ఇండియా జట్టు బౌలింగ్ విభాగంలో బుమ్రా తరువాత అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది మాత్రం అర్షదీప్ సింగ్ మాత్రమే.

ఈసారి డబుల్ కాంబోలో మళ్లీ సంక్రాంతి వస్తున్నాం : అనిల్ రావిపూడి

Actress Aditi Maker: ఫుల్ డ్రెస్ వేసుకున్నా నా ఛాతీని తాకాడు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments