జాతీయం

సికింద్రాబాద్ టు గోవా రైలు ప్రారంభం.. టికెట్ రేట్ ఎంతో తెలుసా..

పర్యాటకులకు, మందుబాబులకు ఖతర్నాక్ న్యూస్. గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నా సరిపడా డబ్బులు లేక టూర్ క్యాన్సిల్ చేసుకునే వాళ్లకు రైల్వే శాఖ ఊరట కల్పించింది. సికింద్రాబాద్ నుంచు గోవాకు డైరెక్ట్ రైలు ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ట్రైన్ ఆదివారం నుంచే మొదలైంది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ పట్టాలెక్కింది.

సికింద్రాబాద్ నుంచి గోవాకు ఈ కొత్త ట్రైన్ 20 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం11: 45 నిమిషాలకు సికింద్రాబాద్ లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7:20 నిమిషాలకు గోవాకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ రైలు మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు వెళ్తుంది.

సికింద్రాబాద్-గోవా రైలు టికెట్ రేట్స్ ఎంతంటే?

సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై 20 గంటల్లో వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకునే ఈ రైలులో టికెట్ రేట్స్ ఎంతో తెలుసుకోవాలని ఉందా. దీనికి సంబంధించిన టికెట్ రేట్స్ స్లీపర్ అయితే 440 రూపాయలు. త్రి టైర్ ఏసీ అయితే ఒక్కరికి 1185 రూపాయలు. ఇక టూ టైర్ ఏసీ కోచ్ అయితే 1700 రూపాయలుగా నిర్ణయించారు. ఇకేం ఆలయం వెంటనే గోవా టూర్ ప్లాన్ చేసుకోండి.. ఫుల్లుగా ఎంజాయ్ చేసి రండి.. ఎలాగూ ఇప్పుడు దసరా సెలవులే కదా.. ఇకెందుకు ఆలస్యం వెంటనే గోవా రైలుకు టికెట్స్ బుక్ చేసుకోండి.. హ్యాపీ జర్నీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button