ఆంధ్ర ప్రదేశ్

యూపీ మాజీ మంత్రికి బినామీగా వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, సీనియర్ జర్నలిస్ట్ వేణుస్వామి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తనపై వేణుస్వామి తప్పుడు ఆరోపణలు చేశారంటున్న జర్నలిస్ట్ మూర్తి.. అతనికి చుక్కలు చూపిస్తున్నారు.వేణుస్వామి, అతని భార్య బినామీ బాగోతాలు బయటికి తీస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి, గ్యాంగ్ స్టర్ గాయత్రి ప్రజాపతికి వేణు స్వామి బినామీ అని మూర్తి సంచలన ఆధారాలు చూపించారు.

గతంలో పలుమార్లు గాయత్రి ప్రజాపతిని వేణుస్వామి కలిశారు. వేణుస్వామి దంపతులు యూపీకి వెళ్లారా లేపోతే ప్రజాపతి ఇక్కడకు వచ్చారా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.కానీ ఆ ప్రజాపతికి మాత్రం వీరు బినామీలుగా ఉంటున్నారన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. గాయత్రి ప్రజాపతి ప్రస్తుతం అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన కేసుల్లో జైలు శిక్షకు గురై జైల్లో ఉన్నాడు. వేణు స్వామి భార్య శ్రీవాణి మా ఫామ్ హౌస్ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొన్ని కోట్ల విలువ చేసే ఆ ఫామ్ హౌస్ వారిది కాదని.. గాయత్రి ప్రజాపతిదేనని ఈ విషయంపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని మూర్తి డిమాండ్ చేస్తూ వివరాలు బయటపెట్టారు. ఒక్కొక్కటిగా వేణుస్వామి వ్యవహారాలను మూర్తి బయట పెడుతూ పోతున్నారు. ఇదెక్కడికి పోతుందోనని వేణు స్వామి దంపతులు బిక్కుబిక్కుమంటున్నారు.

Related Articles

Back to top button