అంతర్జాతీయం

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.. ఇక అంతా శశ్మానమేనా!

మూడో ప్రపంచ యుద్దం మొదలైందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న దేశాలు తమ మనుగడ కష్టమనే ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పశ్చిమాసియాలో వార్ జరుగుతోంది. ఇజ్రాయిల్ పై డైరెక్ట్ వార్ కు దిగింది ఇరాన్. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్.. చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ పై యుద్దానికి దిగింది. 181 మిసైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ పై విరుచుకుపడింది.

మంగళవారం రాత్రి 10 ఇజ్రాయిల్ పై మిసైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. కొన్ని మిసైళ్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఇరాన్ మిసైల్ దాడులతో ఇజ్రాయెల్ తమ దేశ ప్రజలను అలెర్ట్ చేసింది. ప్రభుత్వ హెచ్చరికలతో ఇజ్రాయిల్ ప్రజలు బంకర్లు, ప్రభుత్వ షెల్టర్ హోమ్ లలో తలదాచుకున్నారు. హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా, హెజ్బొల్లా అధినేత నస్రల్లాతో పాటు రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ నిల్ఫోరోషన్ ల మరణాలకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేపట్టినట్లు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించుకుంది.

మరోవైపు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ లో టెర్రర్ దాడి జరిగింది.ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు.టెల్ అవీన్ ​పై ఇరాన్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని భారత సంతతి ప్రజలను అక్కడి మన ఎంబసీ అప్రమత్తం చేసింది. యుద్ధ పరిస్థితి కారణంగా అలర్ట్ గా ఉండాలని, సేఫ్టీ ప్రొటొకాల్స్​ పాటించాలని కోరింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఎల్లప్పుడూ షెల్టర్ హోమ్ లకు దగ్గర్లో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button