క్రైమ్

నాంపల్లిలో దుర్గామాత విగ్రహం ధ్వంసం..‌ రాజాసింగ్ సీరియస్

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. శుక్రవారం రాత్రి దండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు గ్రౌండ్ లొనే ఉన్నారు పోలీసులు. అయితే అర్ధరాత్రి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. మొదటగా కరెంట్ కట్ చేసి సీసీ కెమెరాలు విరగగొట్టారు దుండగులు. అనంతరం విగ్రహం చేతిని ముక్కలు చేశారు. పూజా సామాగ్రిని తొలగించారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేడ్స్ కూడా తొలగించారు దుండగులు.

సంఘటన స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమ్మవారి విగ్రహం ధ్వంసంపై గోషామహాల ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే విగ్రహం ధ్వంసం అయిందని ఆరోపించారు. నిందుతులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button