క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. చిన్నచిన్న ఆనందాలని ఇచ్చేటువంటి సందర్భాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఎంత ప్రమాదం అనేది ఎన్నో సందర్భాలలో రుజువు అయింది. ముఖ్యంగా 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలి అని చెప్పి పలు దేశాలు కూడా బ్యాన్ చేశాయి. మరికొన్ని దేశాలు వ్యక్తిగత విషయాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగులు వేస్తున్నాయి. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ప్రమాదకరంగా మారిపోయింది.
ఒక్కరోజులోనే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క రోజులోనే ఈ సోషల్ మీడియా కారణంగా చనిపోయిన వారు ఉన్నారు. కాబట్టి యువత కొన్ని విషయాలను గమనించాలి. ఈరోజు సోషల్ మీడియాలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు వస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్ లేదా ఇతర ఆధార్, ఓటిపి వంటి కీలక విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఐడెంటిటీ తెఫ్టుకు దారి తీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవసీని కాపాడుకోవడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ నోట్స్ మొబైల్ ఫోన్స్ లేదా లాప్టాప్స్ వంటి వాటిలో ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
