క్రైమ్

కోడలి వేధింపులతో... పురుగులు మందు తాగిన కుటుంబ సభ్యులు!

ఈమధ్య ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఒక్కొక్కసారి తల్లి తండ్రి అయిన గాని అల్లుడు కోడలు లేదా కొడుకు కోడలు ఇలా ఎవరో ఒకరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ కోడలు వేధింపులు తట్టుకోలేక కుటుంబ సభ్యులందరూ కూడా పురుగుల మందు తాగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్లో హైలెట్ గా నిలిచింది.

మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఈ ఘటన అనేది జరిగింది. హోటల్లోని మూడవ అంతస్తులో ఉన్న 308 నెంబర్ గల రూమ్ లో ముగ్గురు అపాస్మారక స్థితిలో పడి ఉండడాన్ని యాజమాన్యం చూసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అనేది అందించారు. ఇక అసలు విషయానికి వస్తే నారాయణ మరియు పద్మావతుల కొడుకు సృజన్. ఈ మధ్యనే కొడుకుకు కావ్యతో ఫిబ్రవరి 14వ తారీఖున ఘనంగా పెళ్లి కూడా జరిపించారు. అయితే మొదట్లో అంతా బాగానే సంసారం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పార్థాలు రావడం వల్ల కోడలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అత్తమామలు అంత సర్దుకుంటాయి కేసు వెనక్కి తీసుకోమని ఎంత కన్విన్స్ చేసినా కానీ కోడలు కావ్య వినలేదు.

Read More : ఐదేళ్ల కొడుకుని చంపి తల్లి సూసైడ్

ఆ తర్వాత ఇక చేసేదేమీ లేక ముగ్గురు కలిసి తాజ్ త్రి స్టార్ హోటల్ కి వెళ్ళారు. అక్కడే బస చేస్తూ తన కోడలు కావ్య కి ఫోన్ చేసి మేము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. అవమానం భరించలేక జ్యూస్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు. దీంతో వెంటనే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే కొంచెం సేపు తర్వాత హోటల్ యాజమాన్యం వచ్చి చూడడం వల్ల హుటా హుటీనా వెంటనే పోలీసులకు సమాచారం అనేది అందించారు. వెంటనే వారొకడికి చేరుకొని వాళ్లందర్నీ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దగ్గరలోని మహంకాళి పోలీస్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ప్రస్తుతం కావ్య పెట్టినటువంటి కేసు పై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button