జాతీయం

ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడాల్సి వస్తోంది, అమిత్ షా షాకింగ్ కామెంట్స్!

Amit Shah About Engilsh: ఇంగ్లీష్ భాష గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భాష మాట్లాడే వారు సిగ్గుపడే రోజు వస్తుందన్నారు. ఆంగ్ల భాష వలసవాద బానిసత్వానికి చిహ్నం అన్నారు. కొంత కాలం తర్వాత ప్రజలు ఆ భాషను తిరస్కరించడం ఖాయం అన్నారు. స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి, వారసత్వాలకు జవసత్వాలు వస్తాయన్నారు. విదేశీ భాషల స్థానాన్ని అవి ఆక్రమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని, నూతన విద్యావిదానంలో త్రిభాష సూత్రాన్ని తమిళనాడులోని డీఎంకే సహా కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో షా వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి.

Read Also: ఆ మార్గాలన్నీ నో ప్లైయింగ్ జోన్ లోకి.. అమర్ నాథ్ యాత్రకు భద్రత్త కట్టుదిట్టం!

ఇంగ్లీష్ వలసవాద బానిసత్వానికి గుర్తు!

తాజాగా ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మై బూంద్ హూ.. ఖుద్ సాగర్ హూ’(నేను నీటి బిందువునే కాదు.. సముద్రాన్ని కూడా) అనే పుస్తకాన్ని అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక భారతీయ భాషలు దేశ సంస్కృతిక ఉన్నతికి కీలకం అన్నారు. ఆంగ్లం మాట్లాడే వారు తర్వరలో సిగ్గుపడే పరిస్థితి వస్తుందన్నారు. అలాంటి సమాజం రావడం మరెంతో దూరంలో లేదని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ భాష వలసవాద భావిసత్వానికి గుర్తు అని చెప్పిన షా.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ దానిని తిరస్కరిస్తారని అభిప్రాయపడ్డారు. మన దేశాన్ని, మన సంస్కృతిని, చరిత్రను, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాషలు సరిపోవన్నారు. అసమగ్ర విదేశీ భాషలతో సంపూర్ణ భారతాన్ని ఊహించలేమని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

Read Also: ఇండో-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, అసలు విషయం చెప్పిన ట్రంప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button