
జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబం ఎప్పుడూ దూరంగానే ఉంచింది. దీనిపై ఎన్నో కథనాలు వచ్చాయి. అందుకే దూరం పెట్టారు.. ఇందుకే దూరం పెట్టారని వార్తలు హల్ చేశాయి. అయితే… దీని వెనుకున్న రహస్యాన్ని రివీల్ చేశారు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరం. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ను… నందమూరి కుటుంబం నుంచి దూరంగా ఉంచాల్సి వచ్చిందని చెప్పారు. ఇంతకీ ఆ కారణం ఏంటి…? నందమూరి ఫ్యామిలీ-జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న ఆ సీక్రెట్ ఏంటి…? పురందేశ్వరం ఏం చెప్పారు..?
జూనియర్ ఎన్టీఆర్ను, ఆయన తల్లిని నందమూరి కుటుంబంలో కలుపుకోలేదు అనేది ఓపెన్ సీక్రెట్. అయితే.. అలా ఎందుకు జరిగిందో… దాని వెనుకున్న కారణాలు ఏంటి… ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ను చినతనం నుంచి నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందనే ప్రచారం ఉందని.. అయితే అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చని చెప్పారామె. ఒకప్పుడు దూరం ఉన్న మాట వాస్తమే అయినా… అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. అందరం కలిసిపోయామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. అయితే… ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే వయస్సు రాలేదని.. అతనిది ఇంకా చిన్న వయస్సే అని.. రాజకీయాల్లోకి రావాలా..? వద్దా…? అనేది పూర్తి అతని నిర్ణయమని చెప్పారామె. సినిమాల్లో మంచి సక్సెస్ సాధించాడని… దేశవ్యప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడని అన్నారు. క్షణం తీరకలేకుండా సినిమాలు చేసుకుంటున్నాడని… అలాంటప్పుడు రాజకీయాలకు సమయం ఎక్కడుంటుందని చెప్పారామె.
Also Read : ఏడాదిలోనే సీన్ రివర్స్ – మళ్లీ వైసీపీ వైపుకే సీమ ఓటర్లు..!
జూనియర్ ఎన్టీఆర్తో తనకు మొదటి నుంచి ఎలాంటి సమస్య లేదన్నారు పురందేశ్వరం. ఎన్టీఆర్ కూడా ఎంతో ఆప్యాయంగా.. అత్తా అని పిలుస్తాడని చెప్పారు. తన పిల్లలు కూడా జూనియర్ ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉంటారని… తరచూ మాట్లాడుకుంటూ ఉంటారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం… ఇంకోలా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి ఫ్యామిలీ చినతనం నుంచి దూరం పెట్టి… సినిమాల్లో క్రేజ్ వచ్చాగ.. నెమ్మదిగా కలిసేందుకు ప్రయత్నించారని అంటున్నారు.