-
శరవేగంగా అభివృద్ది
-
భారీగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
-
తుది దశకు చేరిక మానేరు పనులు
కరీంనగర్, క్రైమ్ మిర్రర్ః తెలంగాణ రాష్ట్రంలో గాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఒకటి. స్మార్ట్ సిటీప్రాజెక్టుల కింద చేపట్టిన అభివృద్ధి పనులు నగర రూపురేఖలను మార్చేశాయి. మెరుగైన రహదారులు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, ఇండోర్ స్టేడియం వంటి మౌలిక సదుపాయాలు పెరిగాయి.
దీంతో నగర శివారు ప్రాంతాలైన రేకుర్తి, తీగలగుట్టపల్లి , ఆల్గనూర్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పుంజుకుంది. ఇక్కడ ప్రస్తుతం చదరపు అడుగు ధర సగటున రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు పలుకుతోంది.ఈ వృద్ధికి ప్రధాన కారణం ప్రతిష్టాత్మకమైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. మానేరు నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు తుది దశకు చేరుకున్నాయి.
దీనికి అనుబంధంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ,ఐటీ టవర్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాయి. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరగడమే కాకుండా, కమర్షియల్ వెంచర్లకు, లగ్జరీ అపార్ట్మెంట్లకు ఇది కేరాఫ్ అడ్రస్గా మారుతోంది.కరీంనగర్ ఇప్పుడు కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, విద్య , వైద్య హబ్గా కూడా ఎదుగుతోంది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ కాలేజీలు, మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాన్డ్ డెవలప్మెంట్ వల్ల పెట్టుబడిదారులు ఇక్కడ స్థిరాస్తులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ 2031 అమలులోకి వస్తే, నగరం చుట్టూ రింగ్ రోడ్డు కనెక్టివిటీ పెరిగి రియల్ ఎస్టేట్ విలువలు మరో 20 నుండి 30 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.









