తెలంగాణ

మాగంటిని చూసి బోరున ఏడ్చిన కేసీఆర్.. పాడె మోసిన కేటీఆర్, హరీష్

జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ అంత్యక్రియలు ముగిశాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయానికి గౌరవవందనం సమర్పించారు పోలీసులు. గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అంతిమ సంస్కారాలు ముగిసేవరకు అక్కడే అన్నారు. అంతకుముందు మాగంటి నివాసం నుంచి మహా ప్రస్థానం వరకు భారీ ర్యాలీ తీశారు. వేలాది మంది కార్యకర్తలు మాగంటి అమర్ రహే అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.కేటీఆర్, హరీష్ రావు మాగంటి పాడె మోశారు.

గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. పార్టీలకు అతీతంగా నేతలు మాగంటి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ లు మాగంటి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. మాగంటికి నివాళి అర్పించిన మాజీ సీఎం కేసీఆర్.. భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button