క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు సౌత్ ఆఫ్రికా మరియు యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 13.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని సాధించింది. సౌత్ ఆఫ్రికా జుట్టు తరఫున బ్రెవిస్ 36 పరుగులతో రాణించారు. గ్రూపు దశలో ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సూపర్ హిట్ కి చేరుకోగా యూఏఈ జట్టు ఈ T20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సూపర్-8 కు ఇండియా, వెస్టిండీస్,సౌతాఫ్రికా,జింబాబ్వే, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజలాండ్ చేరుకోగా.. ఇంకో జట్టు ఫలితం రావాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్మకూరు 13వ వార్డు సభ్యులు రాగటి మత్స్యగిరి గౌడ్
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
