Shocking video: డిసెంబర్ 30, 2025న న్యూఢిల్లీ నుంచి బ్యాంకాక్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శివమ్ రాఘవ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బయటపెట్టడంతో, ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.
https://twitter.com/macroschema/status/2005746685448700231?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2005746685448700231%7Ctwgr%5Eb1c287de6ca494066d7bcb4a3eca8d3493b32578%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fdelhi-bangkok-air-india-flight-drunk-passenger-allegedly-urinated-on-co-travellers-in-the-business-class-watch-video-1710532.html
శివమ్ రాఘవ్ చేసిన పోస్ట్ ప్రకారం.. తన జీవితంలో ఇప్పటివరకు చేసిన అన్ని విమాన ప్రయాణాల్లో ఇదే అత్యంత చెత్త అనుభవమని పేర్కొన్నాడు. బిజినెస్ క్లాస్ వన్ వే టికెట్ కోసం దాదాపు రూ.80 వేలు ఖర్చు చేసినప్పటికీ, ఈ ప్రయాణం తీవ్ర అసహనాన్ని మిగిల్చిందని వివరించాడు. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు తాను చేస్తున్న పనిపై స్పృహ లేకుండా, బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ తన పక్కన ఉన్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించాడు.
ఈ సంఘటన కారణంగా విమానంలోని క్యాబిన్ మొత్తం గందరగోళంగా మారిందని శివమ్ తన పోస్ట్లో వెల్లడించాడు. బిజినెస్ క్లాస్ వంటి ప్రీమియం సేవల్లో కూడా ప్రయాణికుల ప్రవర్తన ఇంత దిగజారడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నాడు. ప్రయాణికుల భద్రత, గౌరవం అనే అంశాలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై సందేహాలు కలిగిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో బిజినెస్ క్లాస్లో మహిళా ప్రయాణికులు ఎవరూ లేరని సమాచారం. అదే ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదోనని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత విమానయాన సంస్థలదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మద్యం సేవించి విమానంలో అదుపు తప్పే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిజినెస్ క్లాస్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఎయిర్ ఇండియా ప్రతిష్టకే కాకుండా, మొత్తం విమానయాన రంగానికి మచ్చ తెచ్చేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని సమాచారం. ప్రయాణికుల భద్రత, గౌరవాన్ని పరిరక్షించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నియమాలు అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
ALSO READ: ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా?
