Monday, February 16, 2026
Homeక్రైమ్Shocking: ఏసు బతికిస్తాడని ఇంట్లో 4 రోజులుగా మృతదేహంతో ప్రార్థనలు

Shocking: ఏసు బతికిస్తాడని ఇంట్లో 4 రోజులుగా మృతదేహంతో ప్రార్థనలు

Shocking: చనిపోయి 4 రోజులు గడిచినా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు నిర్వహించిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. శరీరాన్ని విడిచిన ఆత్మ మళ్లీ తిరిగి వస్తుందనే నమ్మకంతో కుటుంబ సభ్యులు చేసిన వాదనలు స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ వింత ఘటన కూకట్‌పల్లి పరిధిలోని ఓ అపార్టుమెంట్‌లో వెలుగుచూసింది.

గోదావరి జిల్లాకు చెందిన ఏసురత్నం కుటుంబం కూకట్‌పల్లి రామకృష్ణ కాలనీలోని శ్రీ సాయి భరద్వాజ అపార్టుమెంట్ మూడవ అంతస్తులో నివసిస్తోంది. ఏసురత్నం గతంలో పోలీసు శాఖలో ఉప పరిశీలకుడిగా పనిచేసి కొన్నేళ్ల క్రితం మరణించారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతుళ్లు సునీత, శైలజ అక్కడే ఉంటున్నారు. కుటుంబ సభ్యులు 4 పదులు దాటినా వివాహం చేసుకోలేదని సమాచారం.

ఇటీవల శైలజ అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు ఫ్రీజర్ ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అనంతరం ఇంటి తలుపులు లోపల నుంచి మూసుకుని ప్రార్థనలు ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మృతదేహాన్ని అంత్యక్రియలు చేయకుండా ఉంచడంతో అపార్టుమెంట్‌లో దుర్వాసన వ్యాపించింది. దీంతో అనుమానం చెందిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరవాలని పలుమార్లు కోరినా కుటుంబ సభ్యులు నిరాకరించారు. చివరికి అధికారులు కఠిన హెచ్చరికలు ఇవ్వడంతో సోమవారం ఉదయం తలుపులు తెరిచారు. ఫ్రీజర్‌లో ఉంచిన మృతదేహం పూర్తిగా బిగుసుకుపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తూ కనిపించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

తమ కూతురు మళ్లీ ప్రాణం పొందుతుందని నమ్ముతూ 4 రోజులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్టు శమంతకమణి, జయరాం, సునీతలు పోలీసులకు వివరించారు. ప్రార్థనలు పూర్తయ్యాక ఆమె మళ్లీ లేచి నిలబడుతుందని విశ్వసిస్తున్నామని వారు వాదించారు.

ఇదిలా ఉండగా, శైలజ చికిత్స సమయంలో రక్తహీనత కారణంగా రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినప్పటికీ కుటుంబ సభ్యులు నిరాకరించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పరిశుద్ధమైన వ్యక్తుల రక్తమే అవసరమని వారు పట్టుబట్టినట్టు సమాచారం. ఈ నిరాకరణ పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందని చెబుతున్నారు. మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Viral Story: అమ్మ ప్రేమ కోసం తహతహలాడుతున్న కోతి పిల్ల

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments