-
స్టేట్ టాపర్కు రూ.5లక్షలు
-
ప్రతి జిల్లా టాపర్కు రూ. 2లక్షలు
-
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,క్రైం మిర్రర్ః
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధించి నగదు బహుతులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా
శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ వారు ప్రతిభవంతులైన విద్యార్థులకు అందించే నగదు బహుమతి పోస్టర్ ను మంత్రి మంగళవారం ధర్మపురి పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
శ్రీరామ్ లైఫ్ ఇన్యూరెన్స్ వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న 10 వ తరగతి విద్యార్ధులను ప్రోత్సాహించడానికి రూ. 2.2 కోట్ల నగదు బహుమతి అందిస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు నగదు బహుమతి సాధించే విధంగా ర్యాంకులు సాధించాలని మంత్రి విద్యార్ధులకు సూచించారు.
స్టేట్ టాపర్కు రూ.5లక్షలు
రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ పొందిన విద్యార్ధికి రూ. 5 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్ధికి రూ. 3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్ కు రూ. 2 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గ టాపర్ కు రూపాయలు లక్ష రాష్ట్రంలోని 612 మండలాల్లో ప్రధమ స్థానాన్ని పొందిన విద్యార్ధులకు రూ. 10 వేల చొప్పులన నగదు బహుమతి అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కి వివరించారు.





