
క్రైమ్ ది మిర్రర్, మార్చ్ 13, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:- ఇటీవల వెలువడిన గ్రూప్-2 పరీక్షల్లో ప్రతిభ చూపి 25వ ర్యాంక్ సాధించిన ఎస్ఐ శివగౌడ్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, కఠినసాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు.
దశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…
మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా శివ తన విధులను నిర్వహిస్తూనే చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నత ర్యాంక్ సాధించడం, ఇతర పోలీస్ అధికారులకు, యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీసెల్ సిఐ నరేందర్, ఎస్ బి సిఐ చంద్రమౌళి, డీసీఆర్బి సిఐ సత్యనారాయణ, టౌన్ సీఐ దేవేందర్, ఆర్ఐలు నాగేశ్వర్ రావు, అనిల్, పోలిసులు పాల్గొన్నారు