
క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్:- ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్నవారి సంఖ్య చాలానే ఉంది. ఇక మన భారతదేశంలో అయితే ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒంటిమీదకి 30 ఏళ్లు వచ్చినా కూడా చాలామంది ఇంకా కూడా సింగిల్గానే… బ్యాచిలర్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది అమ్మాయిలు వారి కంటే పెద్ద ఏజ్ ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా అసలు ఇష్టపడట్లేదు. మరి కొంతమంది అబ్బాయిలు అయితే మాత్రం ఏకంగా 30 ఏళ్లు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీని వెనుక గల కారణాలు చాలానే ఉండి ఉంటాయి. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత జీవిత కాలంలో మన దేశంలో చాలామంది యువకులు కొంచెం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మొదట్లో అనగా.. ఆనాటి కాలంలో బాల్యవివాహాలు చాలానే జరిగిన సందర్భాలు మనం చూసి ఉంటాం లేదా విని ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లిళ్లు చేసుకోకుండా చాలా మంది త్వరగా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. దీనికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. అబ్బాయిలు జాబులు కారణంగా లేదా చదువుల కారణంగా చాలానే సంవత్సరాలను గడుపుతూ ఉన్నారు. అలాగే మంచి జాబ్ కోసం వెతుకుతూ సంవత్సరాలు కూడా గడిపి వేస్తున్నారు. అలాగే మరోవైపు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవాలి అంటే ఎన్నెన్నో షరతులు పెడుతున్నారు. కొంతమందికి ఎక్కువ జీతం లేదని మరి కొంతమంది మనిషి బాగా లేడని ఇలా అమ్మాయిల కూడా వాళ్లకి నచ్చినట్టు లైఫ్ స్టైల్ లో మలుచుకోవాలని… ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఏళ్ళ ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తమకంటే అబ్బాయిలు మహా అయితే ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే పెద్ద అయితే మాత్రమే పెళ్లికి యాక్సెప్ట్ చేస్తున్నారు. లేదంటే ముఖం మీద అని చెప్పేస్తున్నారు. దీనివల్ల ఎంతో మంది యువకులు ఈనాటికి కూడా పెళ్లిళ్లు కాక ఇబ్బందులు పడుతున్నారు. ఏజ్ గ్యాప్ లో అమ్మాయి తక్కువగా ఉంటే.. ఒక చిన్న పిల్ల అని ఫీల్ వస్తుంది కాబట్టి అబ్బాయిలు కూడా నో అనేస్తున్నారు. లవ్ మ్యారేజ్ విషయానికి అబ్బాయి నచ్చితే చాలు ఎలా ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మాయిలు డామినేషన్ పూర్తిగా నడుస్తుంది. కాబట్టి ఒకప్పుడు బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే ఏజ్ గ్యాప్ ను చూస్తున్నారు.
వినాయక ఫీలింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం
కేసీఆర్, కేటీఆర్ను గుంజుకుపోయి బొక్కలే వేసేవాళ్లం.. రెచ్చిపోయిన బండి సంజయ్