రెండవ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
జగిత్యాల, క్రైం మిర్రర్ః
మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు.
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది జిల్లాకలెక్టరేట్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు.
ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ బుధవారం జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు సమక్షంలో రెండవ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి కె. రాము, కలెక్టరేట్ ఏవో హకిమ్, ఈడిఏం మమత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





