Saturday, March 14, 2026
Homeతెలంగాణరైతులకు శుభవార్త త్వరలో ఖాతాల్లోకి డబ్బులు జమ

రైతులకు శుభవార్త త్వరలో ఖాతాల్లోకి డబ్బులు జమ

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతులకు శుభవార్త అందించారు. అర్హులైన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు.

రైతు భరోసా (గతంలో రైతు బంధు)  పథకం కింద రైతులకు ఎకరాకు సంవత్సరానికి రూ. 12,000/- ఆర్థిక సహాయం రెండు విడతలుగా (ప్రతి సీజన్‌కు రూ. 6,000/-) అందించబడుతుంది. ఈ సాయం భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు కూడా అందించబడుతుంది.

Also Read:నా భూమి నాకు ఇప్పించండి సారు..!

మిగిలిపోయిన అర్హులైన రైతుల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత జూన్ 2025లో, ప్రభుత్వం మొదటి విడతగా రూ. 9,000 కోట్లను 70 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

అధికారికంగా నిర్ధారించిన తేదీ ఇంకా వెలువడనప్పటికీ, త్వరలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు..

Also Read:బాంబు ఘటనకు పాల్పడేవారు ఊపిరి పీల్చుకునే లోపు లేపేస్తాం : బీజేపీ

Also Read:హైదరాబాదులో పెద్ద ఎత్తున సామూహిక విష్ప్రయోగానికి ప్రణాళిక..!

RELATED ARTICLES

Most Popular

Recent Comments