తెలంగాణ

రోడ్డెక్కిన ఎమ్మెల్యే రాజా సింగ్.. పాతబస్తీలో హై టెన్షన్

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే గోషా మహాల్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. గోషామహల్ నియోజకవర్గం లో పురాణపుల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు బిజెపి కార్యకర్తలు. ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజా సింగ్ ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించినా తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. బీజేపీ ఆందోళనలతో గోషా మహాల్ నియోజకవర్గంతో పాటు పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

Read More : రేవంత్‌పై తీన్మార్ మల్లన్న తిరుగుబాటు.. ఆయన వెనకున్నదెవరు?

మంగళ్ హాట్ లోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది. అందులో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను ఇస్మాయిల్, ఖాజాగా గుర్తించారు. నిందితుల ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. వాళ్ల దగ్గర గన్స్, బుల్లెట్లు కూడా దొరికాయి. దీంతో రాజా సింగ్ ను హత్య చేసేందుకే ఆ యువకులు వచ్చారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తన ఫోటోలు తీసి ముంబైకి పంపించారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. గతంలో చాలా సార్లు రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో కూడా ఉన్నారు. దీంతో రాజా సింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారనే వార్తలు ఓల్డ్ సిటీలో హై టెన్షన్ పుట్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button