Tuesday, March 10, 2026
Homeక్రైమ్Missing Girl Case: చేతులు కట్టేసి కాలువలోకి తోసినా తిరిగొచ్చిన బాలిక (VIDEO)

Missing Girl Case: చేతులు కట్టేసి కాలువలోకి తోసినా తిరిగొచ్చిన బాలిక (VIDEO)

Missing Girl Case: పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలను షాక్‌కు గురిచేసింది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కొన్నిసార్లు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మళ్లీ నిరూపించింది. 17 ఏళ్ల యువతిపై తండ్రి చేసిన చర్య, ఆ తర్వాత ఆమె అద్భుతంగా బయటపడటం, తిరిగి ఇంటికి చేరి తండ్రిని రక్షించాలని కోరడం ఇలా అన్ని ఒక విషాద, విశేషమైన కథగా నిలిచిపోయింది.

ఇంట్లో నెలల కొద్దీ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. చదువు మధ్యలోనే మానేసి ఖాళీగా తిరుగుతున్న కూతురిని చూసి తండ్రి సుర్జిత్ సింగ్ ఆందోళన చెందేవాడు. కొన్నిసార్లు అతి అనుమానంతో కుమార్తె ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తేవాడు. భార్య మాత్రం కూతురి పక్షమే ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇలా పెరుగుతున్న కుటుంబ కలహాలు చివరకు ఒక భయంకరమైన రాత్రిని తీసుకొచ్చాయి.

సెప్టెంబర్ 29 రాత్రి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆ రోజు మద్యం మత్తులో ఉన్న తండ్రి సుర్జిత్ సింగ్ ఆగ్రహంతో కుమార్తె చేతులను తాడుతో బిగించి కట్టేశాడు. అతని కళ్ల ముందే భార్య, మరొక ముగ్గురు చిన్న కుమార్తెలు ఆ భయానక దృశ్యాన్ని చూసి వణికిపోయారు. ఏమి జరుగుతుందో అర్థం కాక తల్లి విలపించింది. కానీ కోపంతో ఉన్న సుర్జిత్ సింగ్ పెద్ద కుమార్తెను కాలువ వద్దకు తీసుకెళ్లి చేతులు కట్టేసి నీటిలోకి తోశాడు. నీటిలో కొట్టుకుపోతున్న కూతురిని చూసి “బై బై” అంటూ చేతులు ఊపడం అక్కడున్నవారిని మరింత కంగారు పరిచింది.

ఈ సంఘటనను అతడు మొబైల్ ఫోన్‌లో వీడియోగా రికార్డ్ చేశాడు. తర్వాతా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఇద్దరూ ఆమె మరణించిందని భావించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుర్జిత్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. పూర్తిగా తల్లడిల్లిన కుటుంబం ఆ యువతి కోసం ఎక్కడికక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.

కానీ ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిన తర్వాత, డిసెంబర్ 7న ఆ బాలిక అనూహ్యంగా తిరిగి వచ్చింది. ఆమె సజీవంగా కనిపించడం కుటుంబానికి, పోలీసులకు ఆశ్చర్యకరంగా అనిపించింది. తాను ప్రాణాలతో ఎలా బయటపడగలిగానో ఆమె వివరించింది. నీటిలో పడిన తర్వాత తనకు గాయం అయ్యిందని, కొంతసేపు స్పృహ కోల్పోయిందని తెలిపింది. స్పృహ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్లి చికిత్స పొందినట్లు చెబుతున్నప్పటికీ, ఆ రెండు నెలల కాలంలో తాను ఎక్కడ ఉండిందో మాత్రం వెల్లడించలేదు. తలకు గాయం కారణంగా కొన్ని విషయాలు గుర్తు లేవని మాత్రమే చెప్పింది.

తన తండ్రిని జైలు నుండి విడుదల చేయాలని ఆ యువతి కన్నీళ్లతో పోలీసులను వేడుకుంది. కుటుంబంలో తన ముగ్గురు చెల్లెళ్లను చూసుకునేవారు ఎవరూ లేరని, వారికి తండ్రి తప్ప మరెవరూ ఆధారం కాదని వేడుకుంది. తల్లి అప్పట్లో కోపంతో చెడు మాటలు చెప్పడంతో తండ్రి రెచ్చిపోయాడని ఆమె చెప్పింది. తాను బతికొచ్చినందున హత్య కేసు కొనసాగే అవసరం లేదని, తన తండ్రికి మరో అవకాశం ఇవ్వాలని కోరింది. బంధువులపై నమ్మకం లేదని, తనకు రక్షణ కల్పించాలని కూడా అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్చనున్నట్లు ప్రకటించారు. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ALSO READ: Facts: పెరుగు తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments