దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై భారీ ప్రమాదం..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నేడు ఫిబ్రవరి 3, 2026 ఉదయం ఒక బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది.భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఇన్నాయి..

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వాహనదారుడు అప్రమత్తమై వెంటనే దానిని పక్కకు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బైకు పూర్తిగా కాలిపోయి దగ్ధమైంది.

ఈ సంఘటన కారణంగా బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దింతో సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button