ఎల్బీనగర్,క్రైమ్ మిర్రర్:- తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ , దర్శనం మొగులయ్య అని వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ టి. మహేశ్ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీ.ఎస్కు వచ్చి ఇన్స్పెక్టర్ మహేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీ.ఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్స్పెక్టర్ మహేశ్ గౌడ్ ప్రశంసించారు.
ఆడపిల్లలు కూడా ఇలా తయారయ్యారేంట్రా బాబు!.. ఆస్తి కోసం కన్నతల్లిపై కూతురు దాడి (VIDEO)
ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్ మెట్రో!
