ఖమ్మం, క్రైమ్ మిర్రర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
దాంతో పోలీసులు మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసారు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలించారు.
