క్రైమ్

నా కొడుకు ఆమెను చంపుడు కరెక్టే.. ప్రియుడి తల్లి సంచలనం

జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. జీడిమెట్ల మహిళ అంజలి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు నిందితుడు శివ తల్లి. తన కొడుకు ఆమెను చంపడంలో తప్పే లేదు..ఆమె సచ్చుడే కరెక్టు అని కరాకండిగా చెప్పేశారు హంతకుడు తల్లి. ఇయ్యాల కాకపోతే రేపు నా కొడుకుని బెయిల్ మీద బయటికి తెచ్చుకుంటానని చెప్పారు. నా కొడుకుకి గత 5-6 ఏళ్ల నుండే ఆ అమ్మాయి పరిచయం ఉంది, గత శుక్రవారం మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉందని తెలిపారు.

గతంలో వాళ్ల అమ్మాయి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె మా మీద పోలీస్ కేసు పెట్టి, వాళ్ల అమ్మాయిని తీసుకెళ్లిందని శివ తల్లి వెల్లడించారు. మళ్లీ ఆ అమ్మాయి మా అబ్బాయిని ఎందుకు పిలిచిందో తమకు తెలియదన్నారు. ఆమె తన కూతురిని సరిగ్గా పెంచకపోవడం వల్లనే ఈ తప్పు జరిగిందని చెప్పారు. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసిందని.. దీంట్లో మా అబ్బాయి తప్పేమీ లేదని.. తప్పంతా ఆమె తల్లిదేనని తేల్చి చెప్పారు నిందితుడు శివ తల్లి

జీడిమెట్ల కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్.మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని.. చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని చెప్పారు. తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో ఉంది యువతి. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి.. కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసింది తల్లి అని
బాలానగర్ డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button