Friday, February 20, 2026
Homeతెలంగాణబిల్లు పాసై నేటికి 12 ఏళ్లు

బిల్లు పాసై నేటికి 12 ఏళ్లు

ఎక్స్ వేదికగా హరీష్ రావు పోస్ట్

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ అకౌంట్‌లో బిల్ ఈజ్ పాస్డ్ అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించిన క్రమాన్ని తన పోస్టులో ఆయన వెల్లడించారు. 2014, ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కినట్లు చెప్పారు. శాంతియుతంగా సాగిన స్వరాష్ట్ర ఉద్యమానికి సంకేత సూచకంగా బిల్లు పాసైనట్లు హరీశ్ రావు తన పోస్టులో పేర్కొన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనట్లు చెప్పారు. కేసీఆర్‌తో కలిసి విక్టరీ సంకేతం చేస్తున్న ఫోటోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కొన్ని దశాబ్దాల త్యాగం, పోరాటం, ఆత్మగౌరవం.చివరకు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లు హరీశ్ తన ఎక్స్‌లో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments